ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 8, 2021, 7:54 AM IST

ETV Bharat / city

నగరవాసుల తాగునీటి కష్టాలు దూరం చేసేలా.. ప్రత్యేక ప్రణాళిక!

సాధారణ రోజుల్లో పెద్దగా పట్టని సమస్య వేసవి వచ్చేసరికి పెనుభూతంలా కనబడుతుంది. పక్కనే తుంగభద్ర, హంద్రీ నదుల ప్రవాహమున్నా ఏటా కర్నూలు వాసులకు నీటి ఇక్కట్లు తప్పవు. ఎద్దడి శాశ్వత పరిష్కారానికి అధికారులు రచించిన ప్రణాళికకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

plans for solution of drinking water supply problem
కర్నూలు నగర వాసుల తాగు నీటి కోసం ప్రణాళికులు

కర్నూలు నగరవ్యాప్తంగా 7లక్షల మందికి తాగునీరు అందిస్తున్నా.. వేసవిలో దాహార్తి తీరట్లేదు. ప్రధాన వనరు సుంకేసుల జలాశయంలో వేసవిలో నిల్వలు పడిపోవటం, వానలు ఆలస్యమవడం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సామర్థ్యం సరిపడా లేకపోవడం నీటి కేకలకు కారణమవుతోంది. ఇకపై ఇలాంటి సమస్య తలెత్తకుండా నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కార మార్గాన్ని కనుక్కున్నారు. సుంకేసుల నుంచి ఎస్ఎస్ ట్యాంక్‌ వరకూ పైప్‌లైన్‌ వేయాలని నిర్ణయించారు. అందుకు ప్రభుత్వమూ ఆమోదం తెలిపింది.

నీరు వృథా అరికట్టేందు..

సుంకేసుల నుంచి 23 కిలోమీటర్ల మేర కాల్వ ద్వారా నీటిని తరలించే క్రమంలో నీటి ఆవిరులు, జలచౌర్యం లాంటి కారణాలతో 60 శాతం నీరు వృథా అవుతోంది. దీనిని అరికట్టేందుకు సుమారు 82 కోట్లతో పైప్‌లైన్ వేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ అమృత్‌ పథకంతోపాటు... రాష్ట్ర ప్రభుత్వ, కార్పొరేషన్ నిధులతో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని నిర్ణయించారు.

ప్రణాళికలు సిద్ధం

భవిష్యత్‌లో సుమారు 619 కోట్ల రూపాయలతో గోరుకల్లు నుంచి జగన్నాథగట్టుకు.. అక్కడి నుంచి కర్నూలుకు నీటిని తరలించే ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తయితే తాగునీటి సమస్య పరిష్కృతమైనట్టేనని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

వ్యాక్సిన్‌ పంపిణీ ప్రకటన పట్ల సీఎం జగన్‌ ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details