కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ప్రచారం ఊపందుకుంది. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పలు వార్డుల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. వైకాపా ఛైర్మన్ అభ్యర్థి రఘు ప్రచారంలో పాల్గొని తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.
తెదేపా ప్రచారం
అభివృద్ధి అంటే సైకిల్ .. సైకిల్ అంటే అభివృద్ధి అని కర్నూలు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ భాద్యుడు టీజీ.భరత్ అన్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 11,12 వ వార్డుల్లో ఇంటింటికి తిరిగి తెదేపా అభ్యర్ధికి ఓటు వేయాలని కోరారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని ఓటు హక్కు ఉన్నవారందరు ఓటు హక్కును వినియోగించాలని భరత్ కోరారు.