ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలు లోక్​సభ తెదేపా అభ్యర్థిగా కోట్ల నామినేషన్

కర్నూలు లోక్​సభ తెదేపా అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో తెదేపా విజయం సాధిస్తుందని కోట్ల ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Mar 21, 2019, 8:26 PM IST

కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు.

కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు.
కర్నూలు లోక్​సభతెదేపా అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొదట కిసాన్ఘాట్లోని తండ్రి,.. దివంగత ముఖ్యమంత్రికోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించారు. అనంతరంకలెక్టర్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తెదేపా చేపట్టినసంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో తెదేపా క్లీన్ స్వీప్ చేస్తుందని కోట్ల ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేష్, సినీ నటుడు వేణుమాధవ్ పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details