ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Food Poison: మధ్యాహ్న భోజనం వికటించి.. 40మంది విద్యార్థులకు అస్వస్థత - Food poisoning in KP Tanda school

Food poisoning in KP Tanda: మధ్యాహ్న భోజనం వికటించి.. విద్యార్థులు అనారోగ్యానికి గురైన సంఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కేపీతండాలో జరిగింది. కుళ్లిన గుడ్లు తినడం వల్లే అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులంటున్నారు.

Food poisoning in KP Tanda
వికటించిన మధ్యాహ్న భోజనం..

By

Published : Jan 4, 2022, 4:07 PM IST

Food poisoning in KP Tanda: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కేపీతండాలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి.. 40 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. విద్యార్థులను చాగలమర్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుళ్లిన గుడ్లు తినటం వల్లే వాంతులు చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలలో మొత్తం 67మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details