ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 19, 2022, 1:46 PM IST

ETV Bharat / city

విక్టోరియా రీడింగ్ రూమ్ స్వాధీనంపై హైకోర్టు స్టే..

HC Stay on Victoria Reading Room: కర్నూలు జిల్లా నంద్యాలలో విక్టోరియా రీడింగ్ రూమ్ ను రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది.

HC Stay on Victoria Reading Room
HC Stay on Victoria Reading Room

HC Stay on Victoria Reading Room: కర్నూలు జిల్లా నంద్యాలలో విక్టోరియా రీడింగ్ రూమ్ ను రెవిన్యూ అధికారుల స్వాధీనం చేసుకోవంపై హైకోర్టు స్టే విధించింది. నూతన జిల్లా ఏర్పాటు క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల భవనం కోసం.. విక్టోరియా రీడింగ్ రూమ్ భవనాన్ని ఎంపిక చేసింది రెవిన్యూశాఖ.

ఈ క్రమంలో ఈ రీడింగ్ రూమ్ ను స్వాధీనం చేసుకోవడానికి రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి, తాళం వేసి స్వాధీనం చేసుకున్నారు. అయితే.. సభ్యులందరికీ తెలియకుండా.. సరైన వ్యవధి ఇవ్వకుండా భవనాన్ని స్వాధీనం చేసుకోవడం సరికాదని భావించిన కమిటీ సభ్యులు.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన హైకోర్టు.. విక్టోరియా రీడింగ్ రూమ్ స్వాధీనంపై స్టే విధించింది.

ఇదీ చదవండి :ఆరుపదుల వయసు.. గేట్‌ పరీక్షలో టాప్ ర్యాంకు..!

ABOUT THE AUTHOR

...view details