ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్లాక్ ఫంగస్‌ సోకిన 15 నెలల బాలుడికి ప్రాణం పోసిన వైద్యులు

కాకినాడ జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. బ్లాక్ ఫంగస్‌ సోకిన 15 నెలల చిన్నారికి ప్రాణం పోశారు.

black fungus case at ggh Kakinada
బ్లాక్ ఫంగస్‌ సోకిన బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

By

Published : Jun 8, 2021, 3:43 AM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. బ్లాక్ ఫంగస్‌ సోకిన 15 నెలల చిన్నారికి వైద్యులు ప్రాణం పోశారు. జిల్లాలోని పెనుగొండకు చెందిన జానకీ నందన్ అనే బాలుడికి 15 రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులు ఆ పసివాడ్ని కాకినాడ జీజీహెచ్​లో చేర్పించి చికిత్స అందించారు. ఈ నెల మూడో తేదీన వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. వైద్యులకు బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details