ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2021, 4:16 AM IST

Updated : May 19, 2021, 4:35 AM IST

ETV Bharat / city

ఆర్ఎంపీల వైద్యం వల్లే చాలా మంది చనిపోతున్నారు: మంత్రి వేణుగోపాల​కృష్ణ

ఆర్ఎంపీ డాక్టర్లు ఇష్టానుసారంగా వైద్యం చేయడం వల్లే చాలా మంది చనిపోతున్నారని అన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. కాకినాడలో మాట్లాడిన ఆయన.. ప్రైవేటు ఆస్పత్రులు మానవత్వంతో ఆలోచించాలని కోరారు.

మంత్రి వేణుగోపాల​కృష్ణ
minister venugopala krishna

మంత్రి వేణుగోపాల​కృష్ణ

కరోనా రోగులకు ఆర్​ఎంపీ డాక్టర్లు ఇష్టానుసారంగా వైద్యం చేయడం వల్ల చాలా మంది చనిపోతున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు కూడా మానవత్వంతో ఆలోచించాలని.. సంపాదన కోసం కాకుండా ప్రజలకు సహాయం చేసేలా చూడాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కొవిడ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించిన ఆయన.. అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు.

Last Updated : May 19, 2021, 4:35 AM IST

ABOUT THE AUTHOR

...view details