ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి: సీఐటీయూ - కాకినాడలో పారిశుద్ద్య కార్మికులు ఆందోళన

కాకినాడలోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించాలంటూ.. సీఐటీయూ నాయకులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు.

citu protest news
citu protest news

By

Published : Sep 3, 2020, 6:33 PM IST

కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. కొవిడ్‌ సమయంలో అవసరమైన రక్షణ పరికరాలు ఇవ్వాలని.. బీమా సౌకర్యం కల్పించాలని.. కనీస వేతనం 21వేల రూపాయలు ఇవ్వాలని, ప్రతినెలా 5లోపు జీతం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details