ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2020, 2:04 PM IST

ETV Bharat / city

నివర్ తుపాను నష్టంపై మంత్రుల సమీక్ష

కడప బుగ్గవంక నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. నివర్ తుపాను నష్టంపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు జరిగిన నష్టం, వర్షం వల్ల దెబ్బతిన్న రహదారులు, బుగ్గవంక వరద ప్రవాహం వల్ల నష్టపోయిన నిర్వాసితులు తదితర అంశాలపై చర్చించారు.

review on nivar cyclone
నివర్ తుపాను నష్టంపై మంత్రుల సమీక్ష

కడప బుగ్గవంక నిర్వాసితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన ఆర్థిక సహాయం అందిస్తామని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టంచేశారు. కడప కలెక్టరేట్​లో నివర్ తుపాన్ నష్టంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆయా శాఖల అధికారులతో మంత్రులు మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతులకు జరిగిన నష్టం, వర్షం వల్ల దెబ్బతిన్న రహదారులు, బుగ్గవంక వరద ప్రవాహం వల్ల నష్టపోయిన నిర్వాసితులు తదితర అంశాలపై చర్చించారు. నష్టం వివరాలను అంచనా వేసి సకాలంలో బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details