ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KALVA : 'తెలంగాణ సీఎంతో ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు'

'రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం' అంశంపై కడప(kadapa)లో తెదేపా నేతలు(TDP leaders) సమావేశం(meeting) నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్​(KCR)తో జగన్(jagan) ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆక్షేపించారు.

By

Published : Sep 24, 2021, 7:48 PM IST

కడపలో తెదేపా సమావేశం
కడపలో తెదేపా సమావేశం

రాయలసీమను కాపాడుకోవడానికే తెలుగుదేశం పార్టీ సదస్సులు నిర్వహిస్తోంది తప్పితే... వీటిలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్మోహన్​రెడ్డి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమకు నీటివాటాలు తేల్చకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 'రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం' అనే అంశంపై కడపలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కడప పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి ఆధ్యర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.

రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని తెదేపా నేతలు ఆక్షేపించారు. 2006లోనే ట్రైబ్యునల్​కు లేఖ అందజేసి రాయలసీమకు అన్యాయం చేయడానికి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారని మాజీమంత్రి అమర్నాథ్ ఆరోపించారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై చేసే పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.

ఇదీచదవండి.

ఆ ఉపాధ్యాయురాలి తీరే వేరు.. విద్యార్థులకు నచ్చినట్లుగానే బోధన

ABOUT THE AUTHOR

...view details