కడప నగరంలోని 31వ వార్డులో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రంగంలోకి దిగారు. డీఎస్పీ సునీల్ అడ్డుకున్నారు. దాదాపు అరగంట పాటు ఉద్రిక్తత నెలకొంది. 31వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున ఓ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. పోలింగ్ బూత్లోకి కాంగ్రెస్ పార్టీ తరపున జనరల్ ఏజెంట్ వచ్చారు. అక్కడే ఉన్న వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ శిబిరం వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు అరగంట పాటు ఉద్రిక్తత ఏర్పడింది. ఎట్టకేలకు పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
పురపోరు: కడపలో కాంగ్రెస్, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం - Municipal elections in Kadapa
కడప 31వ డివిజన్లో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు పంపాలని అంజాద్బాషా డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వైకాపా నాయకులను పోలీసులు చెదరగొట్టారు.
పురపోరు: కడపలో కాంగ్రెస్, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం