ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

STUDENT SUICIDE: కేఎల్​యూలో బి.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య - crime news

BIHAR STUDENT SUICIDE
బిహార్‌ విద్యార్థి ఆత్మహత్య

By

Published : Oct 13, 2021, 8:14 PM IST

Updated : Oct 14, 2021, 12:09 AM IST

20:10 October 13

మృతుడు బిహార్​కు చెందిన వాడిగా గుర్తింపు

గుంటూరు జిల్లా కేఎల్​యూలో బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాకు చెందిన సుమిత్ కుమార్​గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    బిహార్​కు చెందిన సుమిత్ కుమార్ కేఎల్​యూ వసతి గృహంలో ఉంటూ.. బీఫార్మసీ చదువుకుంటున్నాడు. వసతి గృహంలోని తోటి సహచరులు పండగ నిమిత్తం ఊరికి వెళ్లి పోవటంతో... గదిలో ఒంటరితనం భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సుమిత్ పక్క గదిలోని విద్యార్థులు భోజనానికి వెళ్లేందుకు పిలవగా.. ఎంతకూ బయటకు రాకపోవటంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే సుమిత్ ప్రాణాలు కొల్పోయాడని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. మృతునికి తల్లిదండ్రులు లేకపోవటంతో అతని మేనమామ చదవిస్తున్నారు.  

ఇదీ చదవండి

పాపం పసివాడు.. దసరా పండక్కి వెళ్లి శవమయ్యాడు.. ఏం జరిగింది?

Last Updated : Oct 14, 2021, 12:09 AM IST

ABOUT THE AUTHOR

...view details