Actor prudhvi raj at Kadapa: కడపలోని శివారెడ్డి అర్బన్ రెసిడెన్షియల్ హోంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో సినీ నటుడు పృథ్విరాజ్ పాల్గొన్నారు. అనాథ పిల్లలకు భోజనాలు వడ్డించి.. వారితో సరదాగా గడిపారు. త్వరలో తాను ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తానని పృథ్వీరాజ్ వెల్లడించారు.అర్బన్ రెసిడెన్షియల్ హోం స్థలంపై కొంతమంది కళ్లు పడ్డాయని.. దయచేసి ఆ స్థలాన్ని వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పృథ్వీరాజును చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పలువురు ఆయనతో సెల్ఫీ తీసుకున్నారు.
వారే నన్ను మోసం చేశారు..