ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా నేతల ఎన్నికల ప్రచారం.. వాహనదారులకు ఇబ్బందులు - Municipal Election Campaign news

గుంటూరు నగరంలో వైకాపా నేతలు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ నేతల తీరుపై వాహనదారులు, పాదచారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
గుంటూరు నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం

By

Published : Feb 22, 2021, 7:21 PM IST

వైకాపా నేతలు అత్యుత్సాహంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు నగరంలో వైకాపా నేతలు నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా... గుంటూరు అమరావతిలోని వేలంగిణి నగర్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ప్రచారం చేపట్టారు. వెళ్ళడానికి వీలు లేకుండా వాహనాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు మొత్తాన్ని మూసివేశారు. వైకాపా నేతల తీరుపై వాహనదారులు, పాదచారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details