ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పండగపూట దారుణం.. భార్యను చంపిన భర్త - పండగపూట దారుణం.. భర్త చేతిలో భార్య హతం

అనుమానం పెనుభాతమైంది. ఒక మహిళ ఉసురు తీసింది. పండుగ పూట కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హత్యచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు.

పండగపూట దారుణం.. భర్త చేతిలో భార్య హతం

By

Published : Sep 2, 2019, 3:32 PM IST

గుంటూరు శివరామనగర్​లో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. గుంటూరు చుట్టుగుంటకు చెందిన దాసరి ఏసుబాబుకు.. జ్యోతితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత కొంతకాలంగా తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఏసుబాబు అనుమానిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఈ విషయమై వారిమధ్య వివాదం జరుగుతోంది. ఆదివారం అర్థరాత్రి జ్యోతి నిద్రిస్తున్న సమయంలో కొబ్బరి బొండాల కత్తితో మెడమీద నరికి ఆమెను హత్యచేశాడని నగరపాలెం సీఐ తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్​కు వచ్చి లొంగిపోయాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పండగపూట దారుణం.. భర్త చేతిలో భార్య హతం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details