ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు - anantapur news

వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6మంది గాయాలపాలయ్యారు. గుంటూరు జిల్లా వినుకొండలో అదుపు తప్పి ఆటో బోల్తా పడగా..అనంతపురం రూరల్ కామారుపల్లి సమీపంలో ద్విచక్రవాహనాన్ని, బొలెరో ఢీకొట్టింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Two died in separate road accidents
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

By

Published : Dec 19, 2020, 9:28 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ మండలం తిమ్మాయపాలెం వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన 15 మంది కూలీలు భవన నిర్మాణ పనులకి వెళ్లి, సాయంత్రం ఆటోలో ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో నవాజ్​కుంట వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురికి కూలీలు గాయపడగా.. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న వారిని గుంటూరుకు పంపనున్నట్లు వైద్యులు తెలిపారు.

అనంతపురం రూరల్ కామారుపల్లి సమీపంలో...

అనంతపురం రూరల్ కామారుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నంపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా, బొలెరో వాహనం ఢీకొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారుపల్లి ప్రదేశంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో యువకుడు..

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికడికక్కడే మృతిచెందాడు. చౌడేపల్లె మండలం కొలింపల్లె గ్రామానికి చెందిన మహేష్(24)కు 5 నెలల కిందట వివాహం జరిగింది. టిప్పర్ డ్రైవర్​గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దినచర్యలో భాగంగా ఉదయమే డ్రైవర్ పనికోసం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మంచు ఎక్కువగా ఉండడంతో కృష్ణపురం వద్ద అతన్ని టిప్పర్ ఢీకొంది. దాంతో అతను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సంఘటనా స్థలాన్ని పుంగనూరు ఎస్సై ఉమామహేశ్వరరావు సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: సాయం చేద్దామనుకున్నారు.. సజీవదహనమయ్యారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details