ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కల్తీ పాలు, నకిలీ విత్తనాల గుట్టు రట్టు.. నిందితులు అరెస్టు - నకిలీ మిరప విత్తనాల వార్తలు

చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరులోని ఆళ్లమడుగులో ఎస్​ఈబీ అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ పాల వ్యవహారాన్ని అధికారులు గుర్తించారు. మరోవైపు.. గుంటూరు జిల్లా తాడికొండ పరిధిలో నకిలీ విత్తనాల వ్యవహారాన్ని సైతం రట్టు చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

police raids
పోలీసుల దాడులు

By

Published : Jun 12, 2021, 12:23 PM IST

చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరులోని ఆళ్లమడుగులో ఎస్​ఈబీ, స్థానిక పోలీసులు నిర్వహించిన దాడుల్లో కల్తీ పాల తయారీని గుర్తించామని అధికారులు తెలిపారు. ఆళ్లమడుగు గ్రామానికి చెందిన మురహరి రెడ్డి గ్రామంలోని పాడి రైతుల నుంచి పాలు సేకరించి పుత్తూరు డైరీకి పంపిస్తాడని విచారణలో తెలిసిందన్నారు. అలా సేకరించిన పాలల్లో రసాయనాలు, పాల పొడులు, వంట నూనెలు కలిపి వెన్నశాతం అధికంగా వచ్చేలా వాటిని మారుస్తున్నాడని చెప్పారు. దాడుల్లో ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు... అతని నుంచి పరికరాలు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నకిలీ విత్తనాల వ్యవహారం..

గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో నకిలీ మిరప విత్తనాలు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అమరావతి మండలం ఖంబంపాడు గ్రామం నుంచి గుంటూరు ట్రాన్స్​పోర్టుకు ఆటోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. సరకు, ఆటోను సీజ్​ చేసి.. ఆటో డ్రైవర్​ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న విత్తనాలు సుమారు రూ.4 లక్షలు విలువ చేస్తాయని తెలిపారు.

ఇదీ చదవండి:

flower markets in loss: కొవిడ్ ధాటికి.. పూల రైతులు, వ్యాపారులు విలవిల!

ABOUT THE AUTHOR

...view details