ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ మద్యాన్ని రాష్ట్రంలోకి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్​

By

Published : Aug 23, 2020, 8:59 PM IST

తెలంగాణ రాష్ట్రం నార్కెట్​ పల్లి నుంచి ఏపీకి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 65 వేల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

telangana liquor caught by guntur police and liquor seize
770 మద్యం సీసాలు స్వాధీనం

రాష్ట్రంలోకి అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు లాలాపేట పోలీసులు ఆదివారం అరెస్ట్​ చేశారు. నిందితుల వద్ద నుంచి 770 మద్యం సీసాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ 65 వేల రూపాయలు ఉంటుందని గుంటూరు అర్బన్​ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మద్యం అక్రమ రవాణా చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్​ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details