ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2020, 3:42 PM IST

ETV Bharat / city

తెదేపా రెబల్​ ఎమ్మెల్యేల వైఖరిపై తెలుగు తమ్ముళ్ల నిరసన

రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు డిమాండ్​ చేశారు. తెదేపా రెబల్ ఎమ్మెల్యేల వైఖరి నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లతో కలిసి ఆయన గుంటూరులో ఆందోళన చేపట్టారు.

తెదేపా రెబల్​ ఎమ్మెల్యేల వైఖరిపై తెలుగు తమ్ముళ్ల నిరసన
తెదేపా రెబల్​ ఎమ్మెల్యేల వైఖరిపై తెలుగు తమ్ముళ్ల నిరసన

తెదేపా రెబల్​ ఎమ్మెల్యేల వైఖరిని నిరసిస్తూ గుంటూరులో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. స్థానిక లాడ్జీ సెంటర్​లోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాడటం చేతకాక... ప్రలోభాలకు లొంగిపోయారంటూ మాణిక్యరావు ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసిన మద్దాలి గిరిధర్​, వల్లభనేని వంశీ, కరణం బలరాం వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. రాజీనామా చేయకుండా చంద్రబాబుని విమర్శించటాన్ని ఆయన తప్పుబట్టారు.

ఇదీ చూడండి:రాజ్యసభ ఎన్నికలు: వ్యూహాత్మకంగా వ్యవహరించిన ‘రెబల్స్‌’

ABOUT THE AUTHOR

...view details