ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP PROTEST: చెత్తపై యూజర్ ఛార్జీలను నిరసిస్తూ తెదేపా ఆందోళన

By

Published : Aug 27, 2021, 2:05 PM IST

చెత్తపై యూజర్ ఛార్జీలను నిరసిస్తూ తెదేపా ఆందోళన చేపట్టింది. చెత్త బండ్లు తోసుకుంటూ తెదేపా కార్పొరేటర్లు నిరసన తెలిపారు. చెత్తపై పన్ను ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

TDP PROTEST
TDP PROTEST

చెత్త సేకరణపై.. యూజర్ ఛార్జీలు వేయడాన్ని నిరసిస్తూ.. గుంటూరులో తెలుగుదేశం కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. హిమని సెంటర్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు చెత్త బండ్లను తోసుకుంటూ నిరసన తెలిపారు. యూజర్ ఛార్జీల వసూలుకు సంబంధించి కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగుతోంది. ప్రజలపై భారం పెంచే చెత్త సేకరణపై.. యూజర్ ఛార్జీలు ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details