చెత్త సేకరణపై.. యూజర్ ఛార్జీలు వేయడాన్ని నిరసిస్తూ.. గుంటూరులో తెలుగుదేశం కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. హిమని సెంటర్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు చెత్త బండ్లను తోసుకుంటూ నిరసన తెలిపారు. యూజర్ ఛార్జీల వసూలుకు సంబంధించి కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగుతోంది. ప్రజలపై భారం పెంచే చెత్త సేకరణపై.. యూజర్ ఛార్జీలు ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.