ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 5, 2021, 4:51 PM IST

ETV Bharat / city

RTC CARGO SERVICES: ఆర్టీసీ కార్గో పరుగులు.. సేవలు మరింత విస్తృతం

కరోనా ప్రభావంతో ప్రజా రవాణా స్తంభించిన నాటి నుంచి ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ రావడం, డోర్ డెలివరీ, కొరియర్ సేవలు తోడుకావడంతో ప్రజాదరణ పెరుగుతోందని అధికారులు అంటున్నారు. అధునాతన పరిజ్ఞానం, మానవ వనరులతో వేగంగా వస్తువుల్ని చేరవేసేందుకు ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.

RTC CARGO SERVICES
RTC CARGO SERVICES

కొవిడ్‌తో కుదేలైన ప్రజా రవాణా శాఖ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పూర్తిస్థాయిలో బస్సులు మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. కరోనా మొదటి దశలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో వస్తు రవాణా సేవల (కార్గో)పై ఆర్టీసీ దృష్టి సారించింది. ఫలితాల్ని సాధించింది. మధ్యలో ధరలు పెంచి ఆదరణ కొంత తగ్గినా తరువాత సేవల్లో మార్పులు చేసింది. రాష్ట్రంలో ఎక్కడికైనా వస్తు రవాణా చేసుకునే అనకాశం ఇప్పటికే ఉంది. ప్రధాన నగరాలకు డోర్‌ డెలీవర్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనికి మంచి అదరణ లభిస్తోంది. ఆర్టీసీ సేవలపై ప్రజల్లో ఉన్న నమ్మకం బుకింగ్స్‌ పెరిగేందుకు దోహదం చేస్తోంది. అధునాతన పరిజ్ఞానం, మానవ వనరులతో వేగంగా వస్తువుల్ని చేరవేసే చర్యలు తీసుకుంటోంది.

సత్తెనపల్లి డిపో పరిధిలో సత్తెనపల్లి పట్టణం, మండలం, ముప్పాళ్ల, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ, పెదకూరపాడు, అమరావతి మండలాలు ఉన్నాయి. 64 బస్సులు రోజూ తిరుగుతున్నాయి. 6 నుంచి 7 వేల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సర్వీసులు ఉన్న అన్ని ప్రాంతాల్లో కార్గో సేవలపై ప్రచారం చేస్తున్నారు. డిపోలో ఒక బస్సును ప్రత్యేకంగా వస్తు రవాణా సేవలకు కేటాయించారు.

  • ఇక్కడి నుంచి హైదరాబాద్‌, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు కందిపప్పు, బియ్యం, కోళ్లదాణా, సున్నం రవాణా చేస్తున్నారు.
  • కొవిడ్‌ సమయంలో కార్గో సేవల్లో జిల్లాలోనే సత్తెనపల్లి డిపో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రైవేట్‌లో కంటే కొంత తక్కువగా ధరలు ఉన్నాయి. దీనికితోడు గమ్యస్థానానికి సకాలంలో నమ్మకంగా వెళ్తాయనే భరోసా పెంపొందిస్తున్నారు.
  • కార్గో సేవల రూపంలో నెలకు రూ. రెండు లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు అదాయం అర్జించాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్నారు.

అందుబాటులోకి డోర్‌ డెలీవరీ నేవలు..

గుంటూరు, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాలతో పాటు జిల్లా కేంద్రాలకు డోర్‌ డెలివరీ సౌకర్యాన్ని గత నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి తెచ్చారు. మొదట్లో 10 కిలోల బరువు ఉన్న పార్శిళ్లు.. కొరియర్లకు అవకాశమివ్వగా ప్రజల నుంచి ఆదరణ నేపథ్యంలో 50 కిలోల వరకు వస్తువుల బరువును పెంచారు. సత్తెనపల్లి డిపోలో వస్తువులు బుక్‌ చేసుకుంటే డోర్‌ డెలివరీ అవకాశమున్న చోటుకు రవాణా అవుతాయి. అక్కడినుంచి గుంటూరు, విజయవాడ నగరాలకు వస్తు రవాణాకు ఎక్కువ బుకింగ్‌లు ఉంటున్నాయి.

  • కొరియర్లు, పార్శిల్‌ రవాణాకు బస్టాండ్‌ కౌంటర్‌లో 79814 79003 నంబరుకు ఫోన్‌ చేసి సంప్రదించాలి.
  • కార్గో సేవలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా 73838 96041, 99592 25429 నంబర్లలో సంప్రదించవచ్చు.

ఆర్టీసీలో వస్తు రవాణా సేవలకు ఆదరణ పెరిగేలా విస్తృత ప్రచారం చేస్తున్నాం. గతంలో ఇలాంటి అవకాశం వ్యాపారులు, ప్రజలకు అందుబాటులో లేదు. దూర ప్రాంతాలకు వస్తు రవాణాతో పాటు కొరియర్‌, పార్మిల్‌ డోర్‌ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. భద్రంగా... వేగంగా వస్తు, పార్మిల్‌, కొరియర్‌ గమ్యస్థానాలకు చేరుస్తాం. కార్గో సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.- మంత్రునాయక్‌, డిపో మేనేజర్‌, సత్తెనపల్లి

ఇదీ చదవండి:

Fake tickets: తితిదే ఛైర్మన్‌ పేరుతోనే బురిడీ... తిరుమల దర్శనం నకిలీ టికెట్లు విక్రయం

ABOUT THE AUTHOR

...view details