ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2021, 3:36 PM IST

ETV Bharat / city

కరోనా సోకిన వారు ధైర్యంగా ఉండాలి: ఎంపీ మోపిదేవి

గుంటూరు జిల్లా రేపల్లె ఆస్పత్రిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సందర్శించారు. ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసదుపాయాలపై ఆరా తీశారు.

rajyasabha member mopidevi venkataramana inspected repalle hospital
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రంలో కరోనా టీకా వేయించుకున్నారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యంపై వివరాలు ఆరా తీశారు.

అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించేందుకు 25 పడకలు, క్వారంటైన్​లో 100 పడకలు ఏర్పాటు చేసినట్లు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. కరోనా సోకిన వారు ధైర్యంగా ఉంటూ.. వైరస్ నియంత్రణకు, కరోనాను జయించేందుకు అవసరమైన కనీస జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details