ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో సెంచరీ కొట్టిన పెట్రోల్ - గుంటూరులో పెట్రోల్ ధర

రోజు రోజుకూ మండుతున్న చమురు ధరలు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా 12 వ రోజు చమురు కంపెనీలు ధరలను పెంచగా.. మన రాష్ట్రంలోనూ లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర వంద రూపాయలను దాటేసింది.

ఏపీలో  సెంచరీ కొట్టిన పెట్రోల్
ఏపీలో సెంచరీ కొట్టిన పెట్రోల్

By

Published : Feb 20, 2021, 9:07 AM IST

పెట్రోల్, డీజిల్‌ రేట్లు మండిపోతున్నాయి. వరుసగా 12 వ రోజు చమురు కంపెనీలు ధరలు పెంచాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను తాకింది.

తాజాగా రాష్ట్రంలోనూ లీటర్ పెట్రోల్ ధర సెంచరీని దాటేసింది. గుంటూరులో లీటర్ ప్రిమియం పెట్రోల్ రూ.100.13 ఉండగా... లీటర్ సాధారణ పెట్రోల్ రూ. 96.68 పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 96.48, డీజిల్ ధర రూ.90.08గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details