ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 5, 2020, 7:49 PM IST

ETV Bharat / city

'దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి మళ్లీ ఉద్యమం'

దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. చట్టసభల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్​ చేశారు.

mrps founder manda krishna madiga attended the meeting
రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి నగరంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. గతంలో చేసిన పోరాటం ఫలితమే నేడు దివ్యాంగులకు రూ 3 వేల పెన్షన్లు వస్తున్నాయన్నారు. త్వరలో రూ. 6 వేలు చేయాలంటూ మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేశారు.

దివ్యాంగుల సంక్షేమ శాఖకు దివ్యాంగులనే మంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో వారికి సముచిత స్థానం కల్పించాలని డిమాండ్​ చేశారు. రాబోయే రోజుల్లో వారి సమస్యల కోసం జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని మంద కృష్ణ చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details