ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడికొండూరు తహసీల్దార్​పై విచారణ..

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడికొండూరు తహసీల్దార్​పై విచారణ చేపట్టారు. తహసీల్దార్ కరుణకుమార్, కంప్యూటర్ ఆపరేటర్ అవినీతికి పాల్పడుతున్నారని మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కార్యాయంలో ఫిర్యాదు చేసినట్లు పులిచింతల ప్రొజెక్టు స్పెషల్ కలెక్టర్ వినాయకం తెలిపారు.

By

Published : Mar 11, 2022, 8:08 PM IST

Published : Mar 11, 2022, 8:08 PM IST

medikonduru MRO facing corruption problem
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడికొండూరు తహసీల్దార్​పై విచారణ... చేపట్టిన కలెక్టర్​ వినాయకం

MRO: గుంటూరు జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడికొండూరు తహసీల్దార్​పై విచారణ చేపట్టారు. పులిచింతల ప్రొజెక్టు స్పెషల్ కలెక్టర్ వినాయకం విచారణ జరిపారు. తహసీల్దార్ కరుణకుమార్, కంప్యూటర్ ఆపరేటర్ అవినీతికి పాల్పడుతున్నారని మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కార్యాయంలో ఫిర్యాదు చేశారని తెలిపారు.

ఇందులో మొత్తం 11మంది మధ్యవర్తులుగా వ్యవరిస్తున్నారని తెలిపారు. పొలం కొలతలు తీయడానికి ఒక్కో ఎకరానికి రూ.50 వేలు డిమాండ్ చేస్తున్నారని, వారిలో సర్వేయర్, మరి కొంత మంది ఉన్నారని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారు శ్యామ్యూల్, శంకర్రావు, అప్పారావు అను ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

వారిలో ఇద్దరు వ్యక్తులైన అప్పారావు, శంకర్రావులను విచారించగా ఫిర్యాదుకి వారికి సంబంధం లేదని తెలిపారు. మూడో వ్యక్తిని గుర్తించలేదని తెలిపారు. దీనికి సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదని వెల్లడించారు. నివేదికను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు ముందుకు వేళ్తామని వినాయకం తెలిపారు.

ఇదీ చదవండి: CORONA CASES IN AP: రాష్ట్రంలో కొత్తగా 46కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details