ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్వవస్థను రాష్ట్రపతే మెచ్చుకున్నారు: లోకేశ్ - అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు: ట్విట్టర్లో లోకేశ్
ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్వవస్థను రాష్ట్రపతే స్వయంగా మెచ్చుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేశారు. వైకాపా నేతలవి అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు.
ట్విట్టర్లో లోకేశ్
ఐదువేల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థను రూ. 350 కోట్లతోనే పూర్తి చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని నారా లోకేశ్ అన్నారు. తాము సాధించిన ఫలితాలను భారత రాష్ట్రపతితో సహా పలు రాష్ట్రాల సీఎంలు అభినందించారని ట్వీట్ చేశారు. తమ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న వైకాపాపై ప్రజలకు రోత పుడుతుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా.. ఈ అసత్య ప్రచారాలెందుకని దుయ్యబట్టారు. రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరంటూ.. ఘాటుగా స్పందించారు.