ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు రాజకీయాలే ముఖ్యం : కన్నా లక్ష్మీనారాయణ - జగన్ పై కన్నా కామెంట్స్

దేశ ప్రజల క్షేమం కోసం ప్రధాని మోదీ.. మే 3 వరకు లాక్​డౌన్​ పొడిగించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ లాక్​డౌన్ పొడిగింపును ప్రజలంతా పాటించాలని కోరారు.

kanna laxminarayan comments on lock down extend
కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Apr 14, 2020, 3:43 PM IST

అంబేడ్కర్​కు నివాళులర్పించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

దేశ ప్రజల క్షేమం కోసం ప్రధాని మోదీ... మే 3 వరకు లాక్​డౌన్​ పొడిగించారని భాజపా రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. మోదీ ఇచ్చిన సందేశాన్ని రాష్ట్ర ప్రజలంతా పాటించాలని కన్నా కోరారు. భాజపా కార్యకర్తలంతా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. రాజకీయాల కన్నా ప్రజలే ముఖ్యమని మోదీ చెబుతుంటే... ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

అంబేడ్కర్ పోరాటం మరువలేనిది : కన్నా

అంబేడ్కర్ 129వ జయంతి సందర్భంగా గుంటూరులోని ఆయన విగ్రహానికి కన్నా లక్ష్మీనారాయణ, భాజపా నేతలు నివాళులర్పించారు. దళితులపై వివక్షను రూపుమాపేందుకు అంబేడ్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్​ ఎనలేని కృషి చేశారన్నారు.

ఇదీ చదవండి:

ఆ ముగ్గురికీ కరోనా వ్యాప్తి ఇలా..!

ABOUT THE AUTHOR

...view details