మిరప రైతుల సాగుసలహాల కోసం నిరంతర సేవాకేంద్రం ఐటీసీ సంస్థ.. మిరప రైతులకు సాగులో ఎదురయ్యే సమస్యల నిర్మూలన, మేలైన యాజమాన్య పద్ధతులను వివరించే నిరంతర స్వర ఆధారిత సేవాకేంద్రం (కాల్ సెంటర్)ను గుంటూరులో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రారంభించారు. ఉద్యానశాఖ, ఉద్యానవర్సిటీ సహకారంతో.. రైతులకు ఏడాది పొడవునా ఈ కాల్ సెంటర్ ద్వారా సలహాలు అందజేస్తారు. వ్యవసాయ పట్టభద్రులు.. రైతుల సమస్యలను నివృత్తి చేస్తారు. ఐటీసీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిరప రైతులను చైతన్యం చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. మిరప పంటతో మొదలైన ఈ తరహా కార్యక్రమాలను.. అన్ని పంటలకు దశల వారీగా విస్తరిస్తామని ఆయన అన్నారు.
ఇదీ చదవండి :