ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి

By

Published : Jan 3, 2021, 3:22 AM IST

స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన గుంటూరులోని చైతన్యపురిలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

student dead in Guntur
student dead in Guntur

గుంటూరులోని చైతన్యపురిలో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నగరంలోని చంద్రమౌళి నగర్​కు చెందిన గంగిశెట్టి రిత్విక్... కర్ణాటకలో ఐఐటీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. శనివారం సాయంత్రం చైతన్యపురిలోని మైత్రివనం అపార్ట్​మెంట్​లోని స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత అపార్ట్​మెంట్​ ఎదుట విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు సమాచారం ఇవ్వటంతో అరుండల్ పేట పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బలవన్మరణమా?... లేదంటే ఏదైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రిత్విక్ తండ్రి ప్రకాశం జిల్లా ఒంగోలులో సబ్ రిజిస్టార్​గా పని చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details