Minister Sucharitha On Jinnah Tower: రాష్ట్రంలో వివాదాస్పందగా మారిన జిన్నా టవర్ అంశంపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదన్నారు. ఏ ఉద్దేశంతోనైనా ఉన్న కట్టడాలు తొలగించాలనడం సరికాదన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పని వ్యాఖ్యానించారు. ఎవరు అధికారంలో ఉన్న ఏన్నో ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
'భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. ఏ ఉద్దేశంతోనైనా ఉన్న కట్టడాలు తొలగించాలనడం సరికాదు. శాంతిభద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోం. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పు. కలాం పేరుతో కొత్త నిర్మాణాలు చేయండి... ఉన్నవి తొలగించవద్దు' - హోంమంత్రి సుచరిత
సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు