పౌరులు అదృశ్యం అవుతుంటే... వారు ఎక్కడున్నారో కనుగొనడంలో అలసత్వం వహిస్తున్నారని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త కోటేష్ను కోర్టులో హాజరుపరిచేలా మంగళగిరి పట్టణ పోలీసులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ... సరోజు అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో పోలీసులు పిలిపించినప్పటి నుంచి తన భర్త కనిపించకుండా పోయారని కోర్టుకు విన్నవించారు.
కోటేష్ ఎక్కడున్నారో పోలీసులు కనుగొనకపోవడంపై హైకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. కనిపెట్టేందుకు కనీస ప్రయత్నం చెయ్యలేదని మండిపడింది. కోటేష్పై ఫోర్జరీ కేసు నమోదు చేయడానికి పోలీసుల వద్ద ఉన్న ఆధారాలేంటని ప్రశ్నించింది. వివరణ ఇచ్చేందుకు గుంటూరు అర్బన్ ఎస్పీ హాజరు కావాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలను చూస్తుంటే జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది.