ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సరిగ్గా ఉండండి.. లేదంటే నగరం నుంచి బహిష్కరిస్తాం' - రౌడీషీటర్లకు గుంటూరు అర్బన్ ఎస్పీ హెచ్చరికలు

ఇటీవల గుంటూరులో నేరాలు ఎక్కువయ్యాయి. వాటిని కట్టడి చేయడంలో భాగంగా.. రౌడీ షీటర్లకు పోలీసు మైదానంలో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తన అలవరచుకోకపోతే నగరం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.

guntur urban sp ammireddy, guntur urban sp counselling to rowdy sheeters
గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, రౌడీషీటర్లకు గుంటూరు అర్బన్ ఎస్పీ కౌన్సెలింగ్

By

Published : Apr 4, 2021, 4:01 PM IST

గుంటూరులోని పోలీసు మైదానంలో రౌడీ షీటర్లకు పోలీసు ఉన్నతాధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ఘటనలు, మత్తు పదార్థాల విక్రయాలు ఇటీవల ఎక్కువ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. నగర పరిధిలో ఏ, బీ, సీ కేటగిరీకి చెందిన సుమారు 700 మందికి.. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నేరుగా కౌన్సెలింగ్ ఇచ్చారు.

తరచుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదని.. సత్ప్రవర్తన అలవరచుకోకపోతే నగర బహిష్కరణ విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని తెలిపారు. ఎలాంటి నేరాలకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details