ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆన్ లైన్ రుణ యాప్​లతో అప్రమత్తం తప్పనిసరి' - గుంటూరు జిల్లా పోలీసుల అవగాహన సదస్సులు

ఆన్ లైన్ రుణ యాప్​లతో మోసపోతున్న ప్రజలకు గుంటూరు జిల్లా పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రయాణాల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా కాపాడే లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం ఆవశ్యకతను తెలియజేశారు.

police conduct awareness seminars
గుంటూరు జిల్లా పోలీసుల అవగాహన సదస్సు

By

Published : Jan 3, 2021, 12:11 PM IST

ఆన్ లైన్ రుణ యాప్​లతో ప్రజలు మోసపోతున్న నేపథ్యంలో వారికి అవగాహన కల్పించేలా గుంటూరు అర్బన్ పరిధిలో పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు. నగరంపాలెంలోని రుషి వ్యాలీ అపార్టుమెంటులో కంట్రోల్ రూమ్ పోలీసులు.. సదస్సు నిర్వహించారు. యాప్​ల వలలో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రయాణాల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా కాపాడే లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం ఆవశ్యకతను పోలీసులు వివరించారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details