ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 11, 2019, 10:33 AM IST

ETV Bharat / city

గుంటూరు జిల్లాలో ఇసుక కొరత లేదు- జిల్లా కలెక్టర్​

గుంటూరు జిల్లాలో ఇసుక కొరత లేదని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. రోజుకి 20 వేల టన్నుల ఇసుక తీసుకునే అవకాశం ఉందని... రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు.

ఇసుక కొరతపై గుంటూరు జిల్లా కలెక్టర్​

గుంటూరు జిల్లాలో ఇసుక కొరత లేదని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. వేల టన్నుల ఇసుక నిల్వ అందుబాటులో ఉందన్నారు. కొల్లిపర, కొల్లూరు మండల కేంద్రాల్లో ఇసుక రీచ్​లు పరిశీలించారు. రోజుకి 20 వేల టన్నుల ఇసుక తీసుకునే అవకాశం ఉందని... రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం తెనాలి చంద్రబాబునాయుడు కాలనీలో ఎస్టీ గురుకుల హాస్టల్ తనిఖీ చేసి పిల్లలను వివరాలు తెలుసుకున్నారు.

ఇసుక కొరతపై గుంటూరు జిల్లా కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details