ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై అప్రమత్తం.. ఆస్పత్రి వార్డులు పరిశీలించిన గుంటూరు కలెక్టర్​

కరోనా కలకలం నేపథ్యంలో చైనాలోని వుహాన్ నుంచి భారతీయులను ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకువచ్చారు. చైనాలో చదువుకుంటున్న విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులను పరీక్షించేందుకు గుంటూరు ఆసుపత్రికి తీసుకువచ్చే అవకాశముంది. అమరావతి రోడ్డులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా వైరస్ వార్డులను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. ఈ వార్డుల్లో పరిశుభ్రత, టాయిలెట్లు, నీటి సరఫరాను పరీక్షించారు. హ్యాండ్ వాష్ బేసిన్లకు అమర్చిన కుళాయిలను వెంటనే సరి చేయాలని సిబ్బందికి సూచించారు.

By

Published : Feb 2, 2020, 9:52 AM IST

guntur collector visit corona special ward
కరోనా ప్రత్యేక వార్డులు పరిశీలించిన గుంటూరు కలెక్టర్

కరోనా ప్రత్యేక వార్డులు పరిశీలించిన కలెక్టర్ శామ్యూల్​ ఆనంద్​

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details