ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు నగర వైకాపా కార్పొరేటర్ రమేశ్ గాంధీ మృతి - గుంటూరు నగర వైకాపా కార్పొరేటర్ రమేశ్ గాంధీ మృతి తాజా వార్తలు

గుంటూరు నగరపాలక ఎన్నికల్లో వైకాపా కార్పొరేటర్​గా విజయం సాధించిన రమేశ్ గాంధీ మృతి చెందారు. కరోనా బారిన పడి కోలుకున్న ఆయన.. ఉపిరితిత్తుల్లో సమస్య ఏర్పడి ఇవాళ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Guntur city ycp corporator Ramesh Gandhi died
గుంటూరు నగర వైకాపా కార్పొరేటర్ రమేశ్ గాంధీ మృతి

By

Published : Apr 8, 2021, 10:33 PM IST

ఇటీవల జరిగిన గుంటూరు నగరపాలక ఎన్నికల్లో వైకాపా కార్పొరేటర్​గా విజయం సాధించిన రమేశ్ గాంధీ మృతి చెందారు. నగరంలోని 6వ డివిజన్​ను నుంచి ఆయన కార్పొరేటర్​గా గెలిచారు. గుంటూరు నగర వైకాపా అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన.. మేయర్ పదవి కోసం పోటీపడ్డారు. కొన్ని కారణాలతో కావటి మనోహర నాయుడికి మేయర్ పదవి దక్కింది.

ప్రమాణ స్వీకారం రోజునే రమేశ్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా.. కొవిడ్ నిర్ధరణ అయింది. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరబాద్ తరలించారు. అక్కడ 20 రోజులకు పైగా చికిత్స పొందారు. కరోనా నుంచి బయటపడినప్పటికీ.. ఇతర అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఉపిరితిత్తుల్లో సమస్య ఏర్పడి ఇవాళ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details