Ganja Seized In Guntur: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేయారు. వారి నుంచి 50 కిలోల సరుకును స్వాధీనం చేసున్నారు. దీని విలువ రూ. 36 లక్షల 59 వేలకుపైగా ఉంటుందని అంచనా వేశారు. నిందితుల నుంచి లిక్విడ్ గంజాయి బాటిళ్లను, రెండు కార్లను సీజ్ చేశారు అధికారులు.
ఈ కేసులో నిందితులు వినయ్ కుమార్, కుర్రా వెంకటేష్, ఇసాక్ వామన్, మహమ్మద్ ఇషన్, బొంతా నితిన్ అనే ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. మరో నిందితుడు అక్బర్ పరారీలో ఉన్నారని తెలిపిన ఎస్పీ.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఇలా దొరికారు..
గుంటూరు లాలాపేటకి చెందిన సిద్దా బత్తుల వినయ్ కుమార్ అనే యువకుడు బీ.టెక్ పూర్తిచేసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. దీంతో గంజాయి ముఠాతో సంబంధాలు పెంచుకున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తుండగా.. గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న సమయంలో వినయ్కు ఇతర రాష్ట్రాల గంజాయి ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు బీబీఏ చదువుతున్న ఓ యువకుడితో పరిచయం పెంచుకున్నాడు. ఆ కుర్రాడితో లిక్విడ్ గంజాయిని విక్రయించడం ప్రారంభించాడు.