ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో విద్యార్థి-యువజన ఐకాస కరపత్రాల పంపిణీ - student assitation on amaravathi

రాజధాని అమరావతి ఆవశ్యకత తెలియచేస్తూ.. అమరావతి పరిరక్షణ యువజన ఐకాస నాయకులు గుంటూరులో కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 'ఒకే రాష్టం ఒకే రాజధాని' అనే నినాదం ఉన్న కరపత్రాలను వాహనాలకు అతికించారు

Distribution of student-youth icon leaflets in Guntur on amaravathi issue
గుంటూరులో విద్యార్థి-యువజన ఐకాస కరపత్రాల పంపిణీ

By

Published : Feb 17, 2020, 2:45 PM IST

అమరావతే రాజధానిగా ఉండాలంటూ... అమరావతి పరిరక్షణ విద్యార్థి-యువజన ఐకాస నాయకులు గుంటూరులో కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వద్ద పాదచారులు, వాహనదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. 'ఒకే రాష్టం ఒకే రాజధాని' అనే నినాదం ఉన్న కరపత్రాలను వాహనాలకు అతికించారు. రాజధానిగా అమరావతి ఆవశ్యకతను తెలియజేస్తూ... ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని విద్యార్థి-యువజన ఐకాస నేతలు తెలిపారు.

గుంటూరులో విద్యార్థి-యువజన ఐకాస కరపత్రాల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details