ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'యాజమాన్య కోట డీఎడ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి'

By

Published : Mar 22, 2021, 5:32 PM IST

యాజమాన్య కోటాలోని డీఎడ్‌ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుమతించాలని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ded students protest at guntur
డీఎడ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి

2018 యాజమాన్య కోటాలో చేరిన డీఎడ్‌ వారికి వార్షిక పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు కలెక్టరేట్‌ వద్ద విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. అప్పుడు పరీక్షలు రాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడెందుకు ఆ నిర్ణయాన్ని అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పరీక్ష నిర్వహిస్తామని స్వయంగా చెప్పినా... ఇంత వరకు ఆ హామీపై స్పందన లేదన్నారు. మరోవైపు 2019 బ్యాచ్​ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించారన్నారు. తద్వారా తాము మానసికంగా కుంగిపోతున్నామని చెప్పారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details