తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు, పండ్లు పంపిణీ చేశారు. అహర్నిశలు ప్రజాసేవకు పాటుపడిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
'ప్రజాసేవకే చంద్రబాబు జీవితం అంకితం' - గుంటూరులో లాక్ డౌన్ పరిస్థితులు
అహర్నిశలు ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పాటుపడిన గొప్ప నాయకుడు చంద్రబాబునాయుడని.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ రవీంద్ర అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా పేదలకు నిత్యావసరాలు అందజేశారు.

గుంటూరులో తెదేపా ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ