ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని విషయంలో సీఎం జగన్.. నియంత పోకడ: సీపీఐ - సీఎం జగన్​ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన

CPI Agitations For CM jagan Comments: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్​ నియంత పోకడని సీపీఐ నేతలు దుయ్యబట్టారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని.. కోర్టు తీర్పు మేరకు నడుచుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు.

CPI Agitations For CM jagan Comments
గుంటూరులో సీపీఐ నిరసన ర్యాలీ

By

Published : Mar 25, 2022, 8:43 PM IST

రాజధాని విషయంలో సీఎం జగన్.. నియంత పోకడ పోతున్నారు: సీపీఐ

CPI Agitations At Guntur: రాష్ట్ర రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. సీఎం జగన్‌ నియంత పోకడ పోతున్నారని సీపీఐ నేతలు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కోర్టు తీర్పు మేరకు నడుచుకోవాలని సూచించారు.

గుంటూరులోని శంకర్‌ విలాస్‌ కూడలి నుంచి లాడ్జ్‌ సెంటర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా చేయడానికి అంగీకరించిన జగన్​.. ఇప్పుడు మాట త‌ప్పారని విమర్శించారు. ఇప్పటికైనా కోర్టు తీర్పు మేరకు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని.. లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details