ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో కరోనా ఉద్ధృతి.. అధికారులు అప్రమత్తం!

By

Published : Apr 15, 2021, 10:47 PM IST

గుంటూరులో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. షాపింగ్ మాల్స్​లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ అనురాధ సూచించారు.

covid awarness programmes in guntur city
గుంటూరులో కరోనా అవగాహన కార్యక్రమాలు

గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో నగరపాలక సంస్థ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. షాపింగ్ మాల్స్​లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ చల్లా అనురాధ సూచించారు.

కేసులు ఎక్కువగా నమోదవుతోన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. పాజిటివ్​గా తేలిన వారి వివరాలు వారి ప్రైమరీ కాంటాక్ట్స్ సేకరించాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించటం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వినియోగించడం చేయాలని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details