ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 21, 2020, 5:13 PM IST

ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్​లో కరోనా మందులు మాయం

గుంటూరు జీజీహెచ్ డ్రగ్ స్టోర్ నుంచి కరోనా చికిత్సకు వినియోగించే రెమిడిసివిర్ మందులు మాయం అయినట్లు గుర్తించారు. వీటిని అక్కడ పనిచేసే ఉద్యోగి తరలించినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

corona drugs stolen from guntur ggh
జీజీహెచ్ నుంచి కరోనా మందులు మాయం

గుంటూరు జీజీహెచ్ డ్రగ్ స్టోర్​లో విలువైన మందులు మాయమయ్యాయి. కరోనా చికిత్సకు వినియోగించే ఖరీదైన రెమిడిసివిర్ ఇంజెక్షన్ల బాక్సును అక్కడ ఓ ఉద్యోగి తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆసుపత్రికి సంబంధించి కీలకమైన డ్రగ్స్ స్టోరులో సీసీ కెమెరాలు లేనట్లు ఆసుపత్రి అధికారులు గుర్తించారు. మందుల అక్రమ తరలింపుపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ప్రభావతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details