ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2019, 7:15 PM IST

ETV Bharat / city

'ప్రశ్నిస్తే.. నోరు నొక్కేయాలనుకోవడం పిరికితనం'

రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని వైకాపా ప్రభుత్వంపై ట్విటర్ చంద్రబాబు మండిపడ్డారు. తప్పు ఎత్తిచూపించే వాళ్లపై దాడులు చేస్తున్నారని, అవి పిరికితనానికి నిదర్శనమన్నారు.

ప్రశ్నిస్తే.. నోళ్లు నొక్కేస్తారా...? : చంద్రబాబు


తప్పును ఎత్తిచూపించే వాళ్ల నోళ్లు నొక్కేయాలనుకోవడం వైకాపా ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. వాటిని హరించడం అప్రజాస్వామికమని చంద్రబాబు ట్విటర్​లో ఆక్షేపించారు. వైకాపా చేసే పనులపట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకిలా భయపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు ట్విట్

ABOUT THE AUTHOR

...view details