గుంటూరు ఆర్.అగ్రహారం పట్నంబజార్లో నిర్వహించిన పడి పూజ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. గురు స్వాముల వేద మంత్రోచ్ఛరణల మధ్య గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్పస్వామికి పుష్పాలంకరణ పూజలు నిర్వహించారు. పెద్ద మండపాలు... పుష్పాల అలంకరణ, విద్యుత్ కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి తాళ్లాయపాలెం పీఠాధిపతి శివ స్వామి హాజరయ్యారు. అయ్యప్పస్వామి దీక్ష ఎంతో పవిత్రమైనదని... భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించే స్వాములుకు దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుందని శివస్వామి అన్నారు.
గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం - ayyappa swamy padipooja a.agraharam
గుంటూరు జిల్లా ఆర్.అగ్రహారం పట్నంబజార్లో అయ్యప్ప స్వామి 14వ పడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, భజన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ వాసవీ మణికంఠ భక్తమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
![గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5383303-160-5383303-1576422981390.jpg)
గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం