ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM

.

By

Published : Dec 15, 2021, 9:04 PM IST

AP TOP NEWS
AP TOP NEWS

  • Bus Accident: జల్లేరులో జల విషాదం..వాగులో పడిన ఆర్టీసీ బస్సు..9 మంది మృతి
    పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని జల్లేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది జల సమాధి అయ్యారు. జల్లేరు వంతెన రెయిలింగ్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Govt Employees on Fitment: 50 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి.. ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగ సంఘాలు
    ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగులతో మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు 50 శాతం ఫిట్‌మెంట్‌ కోరాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Chandrababu comments: 3 టాయిలెట్లు కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా?- చంద్రబాబు
    సీపీఎస్‌ రద్దుపై జగన్ హామీ ఏమైందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు పేటియం బ్యాచ్​లా తయారయ్యారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతుల సభకు హైకోర్టు అనుమతి
    చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'సెమీకండక్టర్స్​పై కేబినెట్​ నిర్ణయం.. ఆవిష్కరణలకు ఊతం'
    సెమీకండక్టర్స్​ తయారీపై కేంద్ర మంత్రివర్గం బుధవారం తీసుకున్న నిర్ణయం.. కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించటంతోపాటు.. తయారీని పెంచుతుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​
    తమిళనాడులో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కోవింద్​తో బంగ్లా ప్రధాని భేటీ- ద్వైపాక్షిక అంశాలపై చర్చ
    భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ అయ్యారు బంగ్లాదేశ్​ ప్రధానమంత్రి షేక్​ హసీనా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈనెల 16,17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆ సేవలు బంద్​!
    బ్యాంకుల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. డిసెంబర్​ 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించినట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ముదురుతున్న టీమ్​ఇండియా వన్డే కెప్టెన్సీ వ్యవహారం..
    టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ బుధవారం బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి చర్చలు జరపకుండానే బీసీసీఐ తనను వన్డే కెప్టెన్​గా తొలగించిందని అన్నాడు. ఈ వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RRR movie: 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. భాయ్​కు ఆహ్వానం!
    ధనాధన్ ప్రచారంతో దూసుకుపోతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్​కు సిద్ధమవుతుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్​ స్టార్ హీరో, దర్శకుడిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details