ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోడల్ టౌన్లుగా తాడేపల్లి, మంగళగిరి..డీపీఆర్​ రూపకల్పనకు ఆదేశాలు

తాడేపల్లి, మంగళగిరి పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోడల్ టౌన్లుగా అభివృద్ధి చేసేలా డీపీఆర్ రూప్పకల్పనకు పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

By

Published : Aug 4, 2020, 4:59 PM IST

ap government
ap government

తాడేపల్లి, మంగళగిరి పట్టణాలను మోడల్ టౌన్లుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 20 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ రెండు పట్టణాలను 1173 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్​) రూపకల్పన బాధ్యతలు ఏపీయూఐఏఎంల్ కు అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి

ABOUT THE AUTHOR

...view details