ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోనె సంచిలో మృతదేహం... గుంటూరులో కలకలం - ఏపీ తాజా వార్తలు

గుంటూరు నగర శివారులో... జాతీయ రహదారి సమీపంలోని ఓ మురుగు కాల్వలో గోనెసంచిలో మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నల్లపాడు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

గోనె సంచిలో మృతదేహం... గుంటూరులో కలకలం
గోనె సంచిలో మృతదేహం... గుంటూరులో కలకలం

By

Published : Jul 23, 2020, 9:07 PM IST

గుంటూరు జాతీయ రహదారి వద్ద సత్యసాయి ట్రస్ట్ ఎదుట ఉన్న మురుగు కాల్వలో ఓ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నల్లపాడు పోలీసులు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన మోదుగుల పూర్ణచంద్రరావు(39)గా గుర్తించారు.

దుండగులు హత్యచేసి గోనెసంచిలో పెట్టి కాలువలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు పూర్ణచంద్రరావు పురుగు మందుల వ్యాపారం చేస్తూ ఉంటాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details