ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా అప్​డేట్స్​: జిల్లాలో కొత్తగా 639 పాజిటివ్ కేసులు - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం... జిల్లాలో కొత్తగా 639 కేసులు నమోదయ్యాయి. ఒక్క గుంటూరు నగరంలోనే 254 కొవిడ్ కేసులు బయటపడ్డాయి.

corona positive cases conformed in guntoor district
guntoor district

By

Published : Aug 2, 2020, 9:49 PM IST



గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. తాజాగా నమోదైన కేసులతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 18వేల295 కి పెరిగాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యాపరంగా చూస్తే గుంటూరు జిల్లా నాల్గో స్థానంలో ఉంది. ఆదివారం విడుదల చేసిన బులిటెన్​లో 639 కొత్త కేసులు నమోదైనట్లు అదికారులు వెల్లడించగా... కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 254 కేసులు బయటపడ్డాయి.

వీటిలో ఐపీడీ కాలనీలో 26 కేసులు, నగరంపాలెంలో 32, పట్టాభిపురంలో 13, శ్రీనివాసరావుతోటలో 9 కేసులు చొప్పున నమోదు కాగా... నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ కేసులు తిష్టవేశాయి. జిల్లాలో మిగతా ప్రాంతాల్లోనూ వైరస్ వేగంగా విస్తరించింది. చిలకలూరిపేటలో 92 కేసులు, పిడుగురాళ్లలో 41 కేసులు, నరసరావుపేటలో 37, పొన్నూరులో 35, పెదకూరపాడులో 19, ఈపూరులో 22, మంగళగిరిలో 21, సత్తెనపల్లిలో 20, తెనాలిలో 16 కేసుల చొప్పున నమోదయ్యాయి.

గుంటూరు నగరం బొంగరాలబీడు శ్మశానవాటికలో కరోనా మృతురాలి అంత్యక్రియల్లో జేసీ దినేశ్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. కొవిడ్–19తో మరణించిన వ్యక్తుల మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు.

ఇదీ చదవండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details