ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో "ప్రత్యేక గ్రీవెన్స్ సెల్" - ఏలూరు కలెక్టరేట్​లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్యాలయంలో సచివాలయ ఉద్యోగ అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి అభ్యర్థుల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.

special-grievance-cell-at-eluru-collectors-office-for-ward-secretary-aspirants

By

Published : Nov 7, 2019, 5:22 PM IST

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో "ప్రత్యేక గ్రీవెన్స్ సెల్"
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థుల నుంచి వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కొందరు తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చారని, కొన్ని కారణాల వల్ల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేకపోయామని తెలిపారు. 15 వెయిటేజీ మార్కులు కలవలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల ఫిర్యాదులపై స్పందించిన జిల్లా కలెక్టర్... అభ్యర్థులకు న్యాయం చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కొందరూ సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకోగా... కలెక్టర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details